Wednesday, July 9, 2014

Dear Friends I am posting the invitation card of my book releasing function. I request all of my friends to participate in the programme and encourage telugu poetry. The Programe is organising by Kavi Sangamam with the cooperation of Runja Association. Please attend. yours Pulikonda Subbachary.

ప్రియ మిత్రులందరికీ అభివాదం. నా కవితా సంకలనం బాడిశ మొక్క బోయింది పుస్తకం ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని ఇక్కడ పెడుతున్నాను. మిత్రులందరూ కార్యక్రమానికి హాజరై తెలుగు కవిత్వాన్ని ప్రోత్సహించగలరని ఆహ్వానం పలుకుతున్నాను. మీ రాక నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ కార్యక్రమాన్ని కవిసంగమం రుంజ సహకారంతో నిర్వహిస్తూ ఉంది.
భవదీయుడు పులికొండ సుబ్బాచారి.

Tuesday, June 17, 2014

పరిశోధన విధానం గురించి సిద్ధాంతగ్రంథ రచన గురించి కొత్త పుస్తకం





A much awaited book in Telugu finally took a shape. Research methodology has been introduced in small booklets by very experienced researchers like Prof. R.V.S Sundaram, Prof. Gandham Apparao and Prof. Jayaprakash. Theses are no doubt sincere efforts with limited purpose. The present book is also a limited but much wider that suits the researchers and research supervisors in Telugu. It is designed as a complete Style Manual for research in Telugu. I happened to see many Telugu dissertations from various Telugu Departments across India. They did not follow a standard method in making notes, designing the chapters adding appendices and finally making bibliography.  Each one followed different style and do not look at a standard book of Style Manual. The present book introduces some international methods and suggests a suitable style and method for Telugu research. The truly serves to the purposes of Researchers and the Researcher Supervisors in Telugu. 

Pulikonda Subbachary.

తెలుగులో పరిశోధన విధానానికి సంబంధించి ఇప్పటికే మూడు చిన్న పుస్తికలు వచ్చాయి. వాటిని రాసిన ముగ్గరూ చాలా పరిశోధనానుభవం ఉన్న మంచి పరిశోధకులు. ఇప్పటికీ వీటిని విద్యార్థులు వినియోగిస్తున్నారు. కాని తెలుగులో పరిశోధన విధానానీకీి సిద్ధాంత గ్రంథ రచనకు సమగ్రమైన శైలీ గ్రంథం లేదా స్టైల్ మాన్యువల్ ను ఇప్పటికీ తెలుగు వారు తయారు చేసుకోలేదు. దీనికి కారణాలు చాలా ఉండవచ్చు. ఇలాంటి శైలీ గ్రంథాలను సంస్థలే చేయాలి. వ్యక్తులు చేయవచ్చు కాని సంస్థలు పెక్కు మంది పరిశోధకులు కూర్చుని చర్చించి చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్టైల్ మాన్యువల్స్ ని వివిధ సంస్థలే అభివృద్ధి చేసాయి. కాని తెలుగు వారిలో ఈ విషయంలో తలలు కూడడం లేదు. అలాంటి సంస్థలు కూడా విశ్వవిద్యాలయ స్థాయిలో మనకు ఏర్పడ లేదు. అకాడమీలు కూడా ఈ పనికి పూనుకో లేదు. మొదటి సారి పూర్తి రూపంలో శైలీ గ్రంథాన్ని తయారు చేసే ప్రయత్నం ఈ పుస్తకం ద్వారా జరిగింది. దీన్ని తొలి ప్రయత్నంగా భావించి తెలుగుశాఖలు ఇంకా సమగ్రమైన శైలీ గ్రంథాన్ని తయారు చేసుకునే పయత్నం చేయాలి. ఈ పుస్తకం వినియోగంలోనికి పూర్తిగా వచ్చిన తర్వాత దీన్ని పాఠకులు ఎలా విస్తృతపరచవచ్చునో తెలియ వస్తుంది. 

భవదీయుడు 
పులికొండ సుబ్బాచారి. 

Saturday, January 25, 2014

PADMASRI TO KOLAKALURI ENOCH

కొలకలూరి ఇనాక్ గారికి పద్మశ్రీ తెలుగు సాహిత్యానికి సరికొత్త కిరీటం

తెలుగు సాహిత్యకారులు  సాహిత్య ప్రేమికులు అందరూ చాలా ఆనందించవలసిన రోజు. భారత ప్రభుత్వం కొలకలూరి ఇనాక్ గారికి పద్మశ్రీని ప్రకటించడం ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక మణికిరీటాన్ని పెట్టినట్లు అయింది. ఇది ఒక వ్యక్తికి కాక అణగారిన వర్గాలకోసం కన్నీరు చిందించిన, సామాజిక దురన్యాయాలను ఎదిరించిన ఒక మహా శక్తికి ఇది ఒక సన్మానం అని మాత్రమే నేను చెప్పడం లేదు. ఇంత ఆలస్యంగా నైనా ఇంతటి మహాశక్తిని గుర్తించడంలో చేసిన లోపాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసిందిని చెప్పదలచుకున్నాను. అంతేకాదు తెలుగు సాహిత్యానికి పద్మశ్రీ రాక ఎన్నో దశాబ్దాలయింది. ఇనాక్ గారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా చేసిన అక్షర సేవకు ఇది చాలా ఆలస్యంగా లభించిన గౌరవంగా దీన్ని చెప్పాలి. నిజానికి పద్మశ్రీ ఆయనకు చాలా చిన్నది పద్మ పురస్కారాల క్రమంగా అన్నింటికి ఉన్నతమైనదాన్ని ఈయనకు ఇవ్వవచ్చు. ఇనాక్ గారు సృష్టించిన కథలు నవలలు వాటిలోని దగా పడ్డ పాత్రలు సమాజంలో చిరకాలం చిరంజీవిగా ఉంటాయి. తెలుగు కథకు అందునా వ్యథాభరిత దగాజీవితాలసజీవ చిత్రణకు చిరకాల చిరునామా గా అవి ఉంటాయి. ఇనాక్ ఆధునిక తెలుగు సాహిత్య శిఖరాలలో ఒకరు.
తెలుగులో మరొక దారుణమైన క్రమం ఉంది. తెలుగులో సాహిత్య పైరవీకారులకు చాలా బలం ఉంది.  పది పైసల ప్రతిభతో పది రూపాయిల పైరవీ చేసి వందరూపాయిల అవార్డులు కొట్టేసే వారున్నారు. వారి పైరవీ బ్రతుకు అందరికీ తెలిసిందే. కాని ఇనాక్ గారికి ఇంత ఆలస్యంగా  ఈ పురస్కారాన్ని ఇస్తున్నందుకు రెండు ప్రభుత్వాలు కాస్తంత గిల్టీగా భావిస్తున్నాయని నేను భావిస్తున్నాను. వచ్చే సంవత్సరం వారికి పద్మవిభూషణ్ వస్తే వారికి న్యాయం జరిగినట్లుగా భావించవచ్చు. వారి రచనలు అన్నింటిని ప్రభుత్వంవారు ప్రచురించాలి. ఇనాక్ పేరిట ఆయన చేసిన సామాజిక చింతన కోసం ఒక అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేయాలి. దీనితోనే ఏ సామాజిక వేదనను తీర్చడానికి ఇనాక్ నాలుగు దశాబ్దాలు అక్షర యజ్ఞం చేశారో దాని విలువను ఈ పీఠం కొనసాగిస్తుందని భావిస్తాను.

పులికొండ సుబ్బాచారి.